దుబాయ్: బిజినెస్ మీట్ కి ముఖ్యఅతిధిగా విచ్చేసిన టి.జి.వెంకటేష్
- November 23, 2019
దుబాయ్:దుబాయ్ లో గణేష్ రాయపూడి(ఇండెక్స్ LLC,దుబాయ్ మ్యానేజింగ్ డైరెక్టర్) ఆధ్వర్యంలో బిజినెస్ మీట్ కి ముఖ్యఅతిధిగా టి.జి వెంకటేష్(రాజ్యసభ ఎం.పి మరియు జాతీయ రవాణా, పర్యాటక, సాంస్కృతిక విభాగాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్) విచ్చేసారు.టి.జి వెంకటేష్ వ్యాపారవేత్త మరియు రాజకీయవేత్త. 1999 నుండి 2004 వరకు మరియు 2009 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసనసభ (ఎమ్మెల్యే) సభ్యుడిగా పనిచేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో మైనర్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. 2016 నుండి రాజ్యసభ సభ్యుడు గా కొనసాగుతున్నారు.
ఈ కార్యక్రమం లో యూ.ఏ.ఈ లోని పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి.జి వెంకటేష్ మాట్లాడుతూ భారత దేశంలో వ్యాపారాలకు ఉన్న అవకాశాలు పై వివరించారు.
ప్రముఖ సోషల్ వర్కర్గా ..40 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించిన ఉమా పద్మనాభన్ (ఉమా ప్యాడీ) ను సత్కరించారు.గణేష్ రాయపూడి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం తదనంతరం విందు ఏర్పాటు చేసారు.







తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







