వ్యక్తి మూత్రం తాగి..పేషెంట్ ప్రాణాలు కాపాడాడు
- November 23, 2019ఆలోచించడానికి టైమ్ లేదు.. వైద్యుడిగా మరో ఆలోచన లేకుండా పేషెంట్ ప్రాణాలు కాపాడడమే అతడి ముందున్న కర్తవ్యం. విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ తోటి ప్రయాణికుడి ఇబ్బందిని గమనించారు. చైనా జువాంగ్జౌ నగరం నుంచి ఓ విమానం న్యూయార్క్కు బయలుదేరింది. మరో 6 గంటల్లో న్యూయార్క్ విమానాశ్రయంలో విమానం లాండ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈలోపు 70 ఏళ్ల ఓ వ్యక్తి పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతున్నారు. బాధ భరించరానిదిగా ఉంది. అదే విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ జాంగ్ హాంగ్ తోటి ప్రయాణికుడి పరిస్థితిని గమనించారు. ఆయన ప్రోస్టేట్ గ్రంధి వ్యాకోచంతో బాధపడుతున్నారని తెలుసుకున్నారు. మూత్రాశయం నుంచి తరచుగా మూత్రాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుందని లేకపోతే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ గుర్తించారు. మరో ఆలోచన లేకుండా పేషెంట్ మూత్ర ద్వారానికి డాక్టర్ ఓ ప్లాస్టిక్ ట్యూబ్ పెట్టి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని బయటకు పీల్చారు. అలా పీల్చిన మూత్రాన్ని ఓ ఖాళీ వైన్ బాటిల్లో పోస్తూ మూత్రాశయాన్ని ఖాళీ చేసి అతడిని ప్రాణాపాయం నుంచి రక్షించారు.
తాజా వార్తలు
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్