సిరియాలో కారు బాంబు పేలుడు..షుమారు పది మంది మృతి, 20 మందికి పైగా గాయాలు
- November 24, 2019అంకారా : ఈశాన్య సిరియాలో శనివారం జరిగిన కారు బాంబు పేలుడులో షుమారు పది మంది మృతి చెందినట్టు టర్కీ రక్షణ శాఖ తెలిపింది. ఈ దుర్ఘటనలో 20మందికి పైగా గాయాలయ్యాయి. టెల్అబియాడ్లోని పారిశ్రామిక వాడలో కారుబాంబు పేలుడు సంభవించింది. సిరియాలోని కుర్దీష్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని మంత్రిత్వ శాఖ ఆరోపించింది. టెల్ అబియాడ్లో ఈ నెలలోనే అంతకుముందు రెండు కారు బాంబు పేలుళ్ళు జరిగి 21 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈశాన్య సిరియాలోని పలు ప్రాంతాలకు టర్కీ విస్తరిస్తూ కుర్దీష్ బలగాలను తన సరిహద్దుల నుండి దూరంగా నెట్టివేస్తోంది. కుర్దీషులను ఉగ్రవాదులుగా టర్కీ భావిస్తుంది. ఇదే కుర్దీష్లు సిరియాలో ఐఎస్ఐతో అమెరికాతో కలిసి పోరాడారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!