తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- May 12, 2024
న్యూ ఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్లైన్ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమాన ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. అనారోగ్యం పేరిట సిక్ లీవ్ తీసుకుని నిరసనకు దిగిన ఎయిర్లైన్ సిబ్బంది తిరిగి విధుల్లో చేరారని క్యాబిన్ క్రూ యూనియన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రద్దు అయిన విమాన సర్వీసులను క్రమంగా పునరుద్దరిస్తోంది.
ప్రతిరోజూ దాదాపు 380 సర్వీసులను నడుపుతున్న ఎయిర్లైన్ ఆదివారం కనీసం 20 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది.అయితే, మంగళవారం ఉదయం (మే 14) నాటికి పూర్తి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు. దీనిపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఎయిర్లైన్లో నిర్వహణ పరమైన సంస్థలు, తమ సిబ్బందిలో కొంతమంది పై వివక్ష చూపిందని ఆరోపించిన క్యాబిన్ సిబ్బందిలోని సుమారు 300 మంది సిబ్బంది సెలవుపై వెళ్లారు. అనంతరం సమ్మెకు దిగడంతో అప్పటినుంచి వందలాది విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. తక్షణం విధుల్లోకి రాకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







