తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- May 12, 2024
న్యూ ఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్లైన్ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమాన ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. అనారోగ్యం పేరిట సిక్ లీవ్ తీసుకుని నిరసనకు దిగిన ఎయిర్లైన్ సిబ్బంది తిరిగి విధుల్లో చేరారని క్యాబిన్ క్రూ యూనియన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రద్దు అయిన విమాన సర్వీసులను క్రమంగా పునరుద్దరిస్తోంది.
ప్రతిరోజూ దాదాపు 380 సర్వీసులను నడుపుతున్న ఎయిర్లైన్ ఆదివారం కనీసం 20 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది.అయితే, మంగళవారం ఉదయం (మే 14) నాటికి పూర్తి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు. దీనిపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఎయిర్లైన్లో నిర్వహణ పరమైన సంస్థలు, తమ సిబ్బందిలో కొంతమంది పై వివక్ష చూపిందని ఆరోపించిన క్యాబిన్ సిబ్బందిలోని సుమారు 300 మంది సిబ్బంది సెలవుపై వెళ్లారు. అనంతరం సమ్మెకు దిగడంతో అప్పటినుంచి వందలాది విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. తక్షణం విధుల్లోకి రాకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!