అమెరికా విలేఖరికి 18 కోట్ల డాలర్ల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ
- November 24, 2019ఇరాన్ చెరలో 544 రోజులపాటు నిర్బంధాన్ని, చిత్రహింసలను ఎదుర్కొన్న ఒక అమెరికా విలేఖరికి 18 కోట్ల డాలర్ల (రూ.1292 కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని అమెరికా కోర్టు ఆదేశించింది. వాషింగ్టన్పోస్ట్ పత్రిక విలేఖరిగా ఇరాన్లో విధులు నిర్వహించిన జాసన్ రెజాయిన్ అనే విలేఖరిని.. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఇరాన్ ప్రభుత్వం 2014లో అరెస్టు చేసింది. అతడి భార్యను కూడా నిర్బంధించి ఆ తర్వాత విడుదల చేసింది. జాసన్ను మాత్రం 544 రోజులపాటు టెహ్రాన్లోని ఒక జైలులో నిర్బంధించి.. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి మేరకు విడుదల చేసింది. అమెరికాకు చేరుకున్న జాసన్.. తనకు ఇరాన్ నుంచి పరిహారం ఇప్పించాలంటూ కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్ జడ్జి.. జాసన్కు 18 కోట్ల డాలర్ల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఇరాన్ స్పందించలేదు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం