అమెరికా విలేఖరికి 18 కోట్ల డాలర్ల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ

- November 24, 2019 , by Maagulf
అమెరికా విలేఖరికి 18 కోట్ల డాలర్ల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ

ఇరాన్‌ చెరలో 544 రోజులపాటు నిర్బంధాన్ని, చిత్రహింసలను ఎదుర్కొన్న ఒక అమెరికా విలేఖరికి 18 కోట్ల డాలర్ల (రూ.1292 కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని అమెరికా కోర్టు ఆదేశించింది. వాషింగ్టన్‌పోస్ట్‌ పత్రిక విలేఖరిగా ఇరాన్‌లో విధులు నిర్వహించిన జాసన్‌ రెజాయిన్‌ అనే విలేఖరిని.. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఇరాన్‌ ప్రభుత్వం 2014లో అరెస్టు చేసింది. అతడి భార్యను కూడా నిర్బంధించి ఆ తర్వాత విడుదల చేసింది. జాసన్‌ను మాత్రం 544 రోజులపాటు టెహ్రాన్‌లోని ఒక జైలులో నిర్బంధించి.. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి మేరకు విడుదల చేసింది. అమెరికాకు చేరుకున్న జాసన్‌.. తనకు ఇరాన్‌ నుంచి పరిహారం ఇప్పించాలంటూ కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్‌ జడ్జి.. జాసన్‌కు 18 కోట్ల డాలర్ల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఇరాన్‌ స్పందించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com