పీఎస్ఎల్వీ సీ47 నింగిలోకి దూసుకెళ్లింది.
- November 27, 2019
శ్రీహరికోట: పీఎస్ఎల్వీ సీ47 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని ఉదయం 9.28 గంటలకు చేపట్టారు. అనంతరం 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ47 ప్రయోగానికి మంగళవారం ఉదయం 7.28 గంటలకు కౌంట్డౌన్ మొదలైంది. ఈ ప్రక్రియ 26 గంటలపాటు సాగింది.
చంద్రయాన్-2 తర్వాత ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగమిది. ఈ ప్రయోగం ద్వారా కార్టోశాట్-3తోపాటు అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపనున్నారు. మూడోతరం హైరెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం కార్టోశాట్-3. దీని జీవిత కాలం ఐదేళ్లు.. బరువు సుమారు 1625 కిలోలు. పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించిన సేవలను ఇది అందించనుంది. ఉగ్రవాద శిబిరాలను కార్టోశాట్-3 మరింత స్పష్టంగా తీయనుంది
తాజా వార్తలు
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- బహ్రెయిన్లో ఇండియన్ క్లబ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం..!!
- సౌదీ అరేబియాలో 1,169 'లూసిడ్ ఎయిర్ ప్యూర్' వాహనాలు రీకాల్..!!
- 'బింఘట్టి' ఉచిత అపార్ట్మెంట్ ను గెలిచిన కేరళ మహిళ..!!
- కువైట్లో ఐదుగురు ఖైదీలకు ఉరిశిక్ష అమలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..







