ఇరాక్‌లో అల్లర్లలో 45 మంది మృతి

- November 29, 2019 , by Maagulf
ఇరాక్‌లో అల్లర్లలో 45 మంది మృతి

ఇరాక్ దేశంలోని బాగ్దాద్ నగరంలో ఆందోళనకారులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 45 మంది పౌరులు మరణించగా, మరో 152 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్ రాజధాని నగరమైన బాగ్దాద్, నసీరియాహ్ నగరాల్లో జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణల్లో 12 మంది నిరసనకారులు మరణించారు.నసీరియాహ్ నగరంలో జరిగిన అల్లర్లలో 25 మంది మరణించారు. నిరసన కారుల ఆందోళనలతో నసీరియాహ్ నగరంలో కర్ఫ్యూ విధించారు.ఈ అల్లర్ల సందర్భంగా ఇరాక్ లో 47 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com