భారత్, శ్రీలంక మైత్రీ మరింత బలోపేతం : శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స
- November 29, 2019
భారత్, శ్రీలంక దేశాల మధ్య మైత్రీ సంబంధాలు బలంగా ఉన్నాయని, వీటిని మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళతామని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స అన్నారు. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన రాజపక్స తొలిసారి విదేశీ పర్యటన నిమిత్తం భారత్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈమేరకు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా రెండు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన రాజపక్సకు రాష్టప్రతి భవన్ వద్ద రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజపక్స విదేశాంగ మంత్రి జైశంకర్ను కలుసుకున్నారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









