భారతదేశంలో అవయవ మార్పిడి కేంద్రాన్ని ప్రారంభించిన డీహెచ్ఏ చీఫ్
- December 04, 2019
దుబాయ్: అవయవ మార్పిడి కేంద్రం ఉన్న ఎస్ఎస్ఎన్ఎంసి ఆసుపత్రిలో ఆగిపోయిన వివిధ రకాల ఆరోగ్య సంరక్షణ రంగాలలో సహకారానికి గల అవకాశాలను అన్వేషించడానికి ప్రస్తుతం కేరళ, బెంగళూరు, ముంబైలోని ప్రధాన ఆసుపత్రులలో పర్యటిస్తున్న ఉన్నత స్థాయి డిహెచ్ఎ ప్రతినిధి బృందం. ఇందులో భాగంగా దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ) చైర్మన్, డైరెక్టర్ జనరల్ హుమైద్ అల్ ఖుతామి బుధవారం బెంగళూరులోని ఆసుపత్రిలో అధునాతన బహుళ అవయవ మార్పిడి కేంద్రాన్ని ప్రారంభించారు.
బెంగళూరు లోని రాజా రాజేశ్వరి నగర్లోని BR Life SSNMC సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ కు విచ్చేసిన డిహెచ్ఎ బృందాన్ని సాదరంగా ఆహ్వానించిన బిఆర్ఎస్ వెంచర్స్ చైర్మన్ డాక్టర్ బిఆర్ శెట్టి, బిఆర్ఎస్ వెంచర్స్ వైస్ చైర్మన్ మరియు గ్రూప్ సిఇఒ బినాయ్ శెట్టి, బిఆర్ లైఫ్ గ్రూప్ సిఇఒ కల్నల్ హేమరాజ్ సింగ్ పర్మార్, బిఆర్ లైఫ్ గ్రూప్. అల్ ఖుతామి తన సందర్శనలో భాగంగా ఆసుపత్రిలో మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్ మరియు ఆండ్రోలజీ కమ్ రిప్రొడక్టివ్ సైన్సెస్ యొక్క రెండు తాజా సూపర్ స్పెషాలిటీ విభాగాలను ప్రారంభించారు. కార్డియాక్ సైన్సెస్, న్యూరో సైన్సెస్, ఆర్థో సైన్సెస్, జిఐ సైన్సెస్ మరియు ఆంకోసైన్స్ సహా ఆసుపత్రిలోని సూపర్ స్పెషాలిటీ సేవల పై డిహెచ్ఎ బృందానికి వివరించారు ఆసుపత్రి యాజమాన్యం.
అల్ ఖుతామి మాట్లాడుతూ, “అధిక-నాణ్యత, సంరక్షణను అందించే లక్ష్యంతో ఆరోగ్య రంగంలో ప్రపంచంలోని ప్రముఖ సంస్థలతో సహకారాన్ని ప్రోత్సహించడానికి మేము ఆసక్తిగా ఉన్నాము. మా సహకారాల ద్వారా దుబాయ్లోని ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరిచి ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణను అందించే లక్ష్యంతో అనుభవం మరియు నైపుణ్యం కలిగిన కొత్త భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తున్నాం. ”
డాక్టర్ శెట్టి ఇలా అన్నారు: " వైద్య రంగంలో పలు కార్యక్రమాలను అన్వేషించడానికి BR లైఫ్ కు దుబాయ్ హెల్త్ అథారిటీ అధికారులు విచ్చేయటం మాకు చాలా గర్వకారణం. భారతదేశం మరియు యూఏఈ మధ్య ఆరోగ్య సంరక్షణ సహకారాన్ని పెంచడానికి మేము ఆసక్తిగా ఉన్నాము. అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు మరియు క్లినికల్ నిపుణులతో దుబాయ్ హెల్త్ అథారిటీతో దీర్ఘకాల సంబంధం కోసం మేము ఎదురుచూస్తున్నాము”.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









