నకిలీ గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తి అరెస్ట్
- December 06, 2019దుబాయ్:నకిలీ గుర్తింపు కార్డు కలిగిన ఓ నైజీరియా వ్యక్తికి దుబాయ్ న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధించింది. మనీ ఎక్సేంజ్ ఆఫీస్లో మరో వ్యక్తికి చెందిన ఎమిరేట్స్ ఐడీ కార్డును చట్టవిరుద్ధంగా వినియోగించటంతో దోషికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. అతని శిక్షా కాలం పూర్తైన వెంటనే బహిష్కరణ అమల్లోకి వస్తుందని న్యాయస్థానం తెలిపింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ రికార్డ్స్ ప్రకారం..శిక్ష పడిన నైజీరియన్ విజిట్ విసాపై దుబాయ్ వచ్చినట్లు తెలిపారు. గత నవంబర్ 11న నైఫ్ లోని మనీ ఎక్సేంజ్ కు వెళ్లిన నైజీరియన్, కెన్యా పౌరుడికి చెందిన ఎమిరేట్స్ ఐడీని తనదిగా చెప్పుకొని మోసానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
భారత్ కు చెందిన ఓ ఉద్యోగి మాట్లాడుతూ..తమ వద్దకు నైజీరియన్ మధ్యాహ్నం ఒంటి గంటా నలభైఐదు నిమిషాల సమయంలో వచ్చినట్లు వివరించారు. ఓమన్ పంపించేందుకు డబ్బు కలెక్ట్ చేస్తున్నట్లు చెప్పాడని వెల్లడించాడు. అయితే..తాను గుర్తింపు కార్డు అడగటంతో కెన్యాకు చెందిన వ్యక్తి ఐడీ కార్డును చూపించాడని భారతీయ ఉద్యోగి దోషి చేసిన మోసాన్ని వివరించాడు. పైగా నిందితుడి వ్యక్తిగత వివరాలు, ఐడీ కార్డులో పేర్కొన్న వివరాలతో సరిపోలేదని, దాంతో పోలీసులకు సమాచారం అందించడంతో అతన్ని అరెస్ట్ చేశారని వివరించాడు.
పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారణలో నైజీరియన్ తనపై మోపిన అభియోగాలను అంగీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అతని నుంచి ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. అయితే..ప్రస్తుత తీర్పుపై దోషి అప్పీల్ కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్