దుబాయ్:ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ వేడుకలు
- December 06, 2019
దుబాయ్: గత శుక్రవారం సాయంత్రం దుబాయ్ లోని అల్ నాసర్ క్లబ్ లో ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు మరియు ప్రముఖ కమెడియన్ డా.బాబు మోహన్ ముఖ్య అతిధిగా మరియు మోమిన్(లీగల్ కన్సల్టెంట్),బందెల రాజేస్ అతిధిలుగా విచ్చేశారు.దైవజనులు గొల్ల ఎలీషా ఆధ్వర్యంలో సంఘ క్వయర్ వారిచే మధురగీతములు వినిపించబడ్డాయి.ముఖ్య ప్రసంగీకులుగా దైవజనులు గొల్ల జాకబ్ చక్కని వాక్యోపదేశాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక జీవితం, దైవిక లక్షణాలు కలిగి ఉండాలని సంఘాన్ని ఆత్మీయంగా హెచ్చరించారు.
మాజీ మంత్రివర్యులు, ప్రముఖ సినీనటుడు డా.బాబు మోహన్ ముఖ్య అతిధిగా రావటం, వారియెక్క అమూల్యమైన సాక్షము, జీవితపు విలువలను తమదైన శైలిలో అందించారు. అందరిని ఆనంద సాగరంలో ముంచేసారు.అతిధిగా విచ్చేసిన యౌవన సువార్తికుడు బందెల రాజేస్ ఇచ్చిన హెచ్చరికలు అందరినీ ఆలోచింపజేసాయి.అంతర్జాతీయ సువార్త గాయకురాలు సిస్టర్ సుజాత తమ మధురమైన స్వరముతో దేవున్ని మహిమపరిచారు.చిన్నబిడ్డలు వర్ధిల్, ఆరాధ్య మరియు ప్రిన్సి గంభీరముగా పాడిన చక్కని పాటతో అందరినీ ఆనందములో ముంచెత్తారు.చివరిగా ఈ కార్యక్రమాన్ని కేక్ కటింగ్ అనంతరం అందరూ విందు లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అనురాధ ఓబిలిశెట్టి(లీగల్ కన్సల్టెంట్),షాలేం బాబు(లీగల్ కన్సల్టెంట్) శ్రీకాంత్ చిత్తర్వు(మాగల్ఫ్ చీఫ్ ఎడిటర్) మరియు APNRT కో-ఆర్డినేటర్లు వాసురెడ్డి, ఖాదర్ బాషా,రవి కిరణ్,గుండెల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.






తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









