బ్యాకాంక్ లో మణిరత్నం మల్టీస్టారర్ షూటింగ్ ప్రారంభం
- December 14, 2019
ప్రముఖ దర్శకుడు మణిరత్నం భారీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కల్కి విరచిత పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'పొన్నియన్ సెల్వన్' టైటిల్ పెట్టారు. విక్రం, జయంరవి, కార్తి, మోహన్ బాబు, ఐశ్వర్యారాయ్, కీర్తిసురేష్ వంటి భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారమ్.
తాజగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ బ్యాంకాక్ లో మొదలైంది. షూటింగ్ స్పాట్ నుంచి దర్శకుడు మణిరత్నం ఫోటో ఒకటి బయటికొచ్చింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానరుపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. మణిరత్నం సారథ్యంలోని మెడ్రాస్ టాకీస్ కూడా నిర్మిస్తోంది. కుమరవేల్ తో కలిసి స్క్రీన్ ప్లే సమకూర్చారు మణిరత్నం. మాటలు జయమోహన్ రాశారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చుతున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









