బ్యాకాంక్ లో మణిరత్నం మల్టీస్టారర్ షూటింగ్ ప్రారంభం

- December 14, 2019 , by Maagulf
బ్యాకాంక్ లో మణిరత్నం మల్టీస్టారర్ షూటింగ్ ప్రారంభం

ప్రముఖ దర్శకుడు మణిరత్నం భారీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కల్కి విరచిత పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'పొన్నియన్ సెల్వన్' టైటిల్ పెట్టారు. విక్రం, జయంరవి, కార్తి, మోహన్ బాబు, ఐశ్వర్యారాయ్, కీర్తిసురేష్ వంటి భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారమ్.

తాజగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ బ్యాంకాక్ లో మొదలైంది. షూటింగ్ స్పాట్ నుంచి దర్శకుడు మణిరత్నం ఫోటో ఒకటి బయటికొచ్చింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానరుపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. మణిరత్నం సారథ్యంలోని మెడ్రాస్ టాకీస్ కూడా నిర్మిస్తోంది. కుమరవేల్ తో కలిసి స్క్రీన్ ప్లే సమకూర్చారు మణిరత్నం. మాటలు జయమోహన్ రాశారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com