యూఏఈ బ్రాండ్ లోగో ఎంపిక కోసం ఆన్ లైన్ ఓటింగ్
- December 18, 2019
యూఏఈ ఇమేజ్ చాటిచెప్పేలా లోగో సెలక్ట్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం. ఈ లోగో ఎంపికలో మీరు కూడా భాగస్వామ్యం కావొచ్చు. మీరు ఎంపిక చేసే లోగో రాబోయే 50 ఏళ్లు యూఏఈ బ్రాండ్ కు చిహ్నంగా ఉండబోతోంది. లోగో ఎంపిక కోసం యూఏఈ వాసులు ఆన్ లైన్ ఓటింగ్ లో పాల్గొని బెస్ట్ లోగోను ఎంపిక చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఓట్లు పొందిన లోగోను ఫైనల్ చేస్తారు. యూఏఈ బ్రాండ్ సూచించేలా మూడు లోగో డిజైన్లకు ఆన్ లైన్ లో ఓటింగ్ చేపట్టారు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు www.nationbrand.ae వెబ్ సైట్ ను లాంచ్ చేశారు. యూఏఈ ప్రధాని 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం' ఈ వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. యూఏఈ ప్రతిష్టను చాటేలా లోగోను ఎంపిక చేసేందుకు ప్రజలు ఓటింగ్ లో పాల్గొనాలని షేక్ మొహమ్మద్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక కార్గో టెర్మినల్ 2 ప్రారంభం
- 2026 జూన్ 1 నుంచి యూఏఈ ప్రైవేట్ రంగానికి ఏకీకృత జీతాల గడువు అమలు
- ఫేక్ ఉద్యోగాల పేరిట మహిళలను ఆకర్షించి, లైంగిక దోపిడీ..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలు.. యూఏఈ, ఈజిప్టులతో సౌదీ చర్చలు..!!
- కువైట్ లో 'WAMD' సాంకేతిక వైఫల్యాలకు ఫైన్స్..!!
- సీబీఎస్ఈ తాజా నిబంధన నుండి యూఏఈ స్కూళ్లకు మినహాయింపు..!!
- లోకల్ తేనె విక్రయాలపై అవేర్ నెస్ వర్క్ షాప్..!!
- ఒమానీ రియాల్కు 250 మార్కును దాటిన రూపాయి..!!
- మోదీ, ఉల్ఫ్ ఉల్ఫ్ క్రిస్టర్సన్-స్వీడన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల అంగీకారం
- హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ రూట్ ఇదే..









