డాలర్ దెబ్బకు...రూపాయి కుదేలు

- January 15, 2016 , by Maagulf
డాలర్ దెబ్బకు...రూపాయి కుదేలు


  డాలర్ ధర పెరగడంతో రూపాయి విలువ క్రమేపీ పతనం చెందుతోంది. గురువారం నాటికి అమెరికా డాలర్ 67.52240 కు చేరుకోవడంతో రూపాయి కుదేలు కావడం పలువురు ఆర్ధికవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. డాలర్ స్థాయి అలా ఉంటె దిర్హం  విలువ రూపాయితో సరిపోల్చితే, 18.38 గా ఉంది. 2013 సెప్టెంబర్ లో అమెరికా డాలర్ విలువ 68.15  ఉన్నప్పుడు , దిర్హం విలువ 18.55 గా ఉండేది. భారథదెశ రిజర్వు బ్యాంకు గవర్నర్  ' రాక్ స్టార్ గవర్నర్ '   గానూ పిలవబడే, రఘురాం రాజన్  పదవీభాద్యతలు చేపట్టిన తర్వాత దేశ ఆర్ధిక వ్యస్థను ఒక గాడిలో పెట్టారు.  రూపాయి విలువను పెంచడంలో ఎంతో కృషి చేశారు. అపుడు దిర్హం తో రూపాయిని  సరిపోల్చితే, 14.4 ఉండేది. ఈ విధంగా 8 నెలల పాటు కొనసాగింది. ఆ తర్వాత 15.87 గా  మే నెల 2014 వరకు ఉంది. ఆయన హయాం లో  తీసుకొన్న కొన్ని 
  విప్లవాత్మక నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇందుకు ముఖ్య కారణం ఏమిటంటే , విదేశీ , స్థానిక ఆర్ధిక సంస్థలను ప్రోత్సాహించారు. ప్రస్తుతం రూపాయి విలువ 15.8 కు విలువకు పడిపోవడం పలువురు ఆర్ధికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా ఆర్ధిక వ్యవస్థ పతనం చెందడం  ఓ ప్రధాన కారణమని ఆ ప్రభావం రూపాయి పై పడిందని వారు విశ్లేషణ ఇస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com