డాలర్ దెబ్బకు...రూపాయి కుదేలు
- January 15, 2016
డాలర్ ధర పెరగడంతో రూపాయి విలువ క్రమేపీ పతనం చెందుతోంది. గురువారం నాటికి అమెరికా డాలర్ 67.52240 కు చేరుకోవడంతో రూపాయి కుదేలు కావడం పలువురు ఆర్ధికవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. డాలర్ స్థాయి అలా ఉంటె దిర్హం విలువ రూపాయితో సరిపోల్చితే, 18.38 గా ఉంది. 2013 సెప్టెంబర్ లో అమెరికా డాలర్ విలువ 68.15 ఉన్నప్పుడు , దిర్హం విలువ 18.55 గా ఉండేది. భారథదెశ రిజర్వు బ్యాంకు గవర్నర్ ' రాక్ స్టార్ గవర్నర్ ' గానూ పిలవబడే, రఘురాం రాజన్ పదవీభాద్యతలు చేపట్టిన తర్వాత దేశ ఆర్ధిక వ్యస్థను ఒక గాడిలో పెట్టారు. రూపాయి విలువను పెంచడంలో ఎంతో కృషి చేశారు. అపుడు దిర్హం తో రూపాయిని సరిపోల్చితే, 14.4 ఉండేది. ఈ విధంగా 8 నెలల పాటు కొనసాగింది. ఆ తర్వాత 15.87 గా మే నెల 2014 వరకు ఉంది. ఆయన హయాం లో తీసుకొన్న కొన్ని
విప్లవాత్మక నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇందుకు ముఖ్య కారణం ఏమిటంటే , విదేశీ , స్థానిక ఆర్ధిక సంస్థలను ప్రోత్సాహించారు. ప్రస్తుతం రూపాయి విలువ 15.8 కు విలువకు పడిపోవడం పలువురు ఆర్ధికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా ఆర్ధిక వ్యవస్థ పతనం చెందడం ఓ ప్రధాన కారణమని ఆ ప్రభావం రూపాయి పై పడిందని వారు విశ్లేషణ ఇస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







