భారతీయ వైద్యుల కోసం బ్రిటన్ కొత్త పథకం
- December 20, 2019
ప్రభుత్వ నిధులతో పనిచేసే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) లో శ్రామిక శక్తి కొరతను తీర్చడానికి భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుండి అర్హత కలిగిన వైద్యులు, నర్సుల కోసం కొత్త వీసాను ప్రవేశపెట్టే ప్రణాళికలను యూకే ప్రభుత్వం గురువారం ధృవీకరించింది. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఎన్నికల ప్రచార బాటలో 'ఎన్హెచ్ఎస్ వీసా' గురించి సూచనలు చేశారు, ఇది గురువారం పార్లమెంటులో క్వీన్స్ ప్రసంగంలో భాగంగా నిర్ధారించబడింది. 'నేషనల్ హెల్త్ సర్వీస్ యొక్క శ్రామిక శక్తిని పెంచడానికి చర్యలు తీసుకోబడతాయి. అర్హతగల వైద్యులు, నర్సులు, ఆరోగ్య నిపుణులు కొత్త వీసా తో యునైటెడ్ కింగ్డమ్లోకి ప్రవేశిస్తారు' అని ఆమె ప్రసంగం యొక్క సారాంశం.
ప్రపంచవ్యాప్తంగా తెలిమైన, ప్రతిభగల వారిని ఆకర్షించడానికి ఆస్ట్రేలియన్ తరహా పాయింట్ల-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను యూకే ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ 'ఎన్హెచ్ఎస్ పీపుల్ ప్లాన్' క్రింద అర్హతగల వైద్యులు, నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు ఉద్యోగ ప్రతిపాదనతో గుర్తింపు పొందిన ప్రమాణాలకు అర్హత ఉన్న వారికి యూకే రావడానికి ఫాస్ట్ ట్రాక్ వీసా ఇవ్వబడుతుంది. వచ్చే ఏడాది బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఇయు) ను వీడనుంది. బ్రెక్సిట్ అనంతర కొత్త వీసా, ఇమ్మిగ్రేషన్ విధానం సరళంగా ఉంటుందని బ్రిటిష్ ప్రభుత్వం పేర్కొంది. యూరోపియన్ యూనియన్ యొక్క నిబంధనలు ఇకపై యూకేకి వర్తించవు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









