యూఏఈ:ఉల్లంఘనలకు పాల్పడుతున్న స్టోర్ మూసివేత
- December 27, 2019యూఏఈలోని ఓ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతున్న దరిమిలా, దాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది అధికార యంత్రాంగం. అబుదాబీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ, బకాలా టాప్ సేవ్ మోర్ ఎల్ఎల్సి స్టోర్ని హెల్త్ సంబంధిత ఉల్లంఘనల నేపథ్యంలో మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. స్టోర్లో హైజీన్ కండిషన్స్ని మెరుగుపర్చేదాకా మూసివేస్తున్నట్లు వెల్లడించింది అధికార యంత్రాంగం. పెద్దయెత్తున ఫ్రోజెన్ ప్రోడక్ట్స్ని ఫ్రీజర్స్ మరియు రిప్రిజిరేటర్స్లో సదరు స్టోర్ నిల్వ చేస్తోంది.. అదీ అపరిశుభ్ర వాతావరనంలో. లైసెన్స్ని సైతం సదరు స్టోర్ రెన్యువల్ చేయించుకోలేదు. జూన్, సెప్టెంబర్, అక్టోబర్ మరియు డిసెంబర్లలో ఈ స్టోర్కి హెచ్చరికలు జారీ చేసినా నిర్వహకులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం