ఇసుక దొంగతనం: వ్యక్తికి మూడేళ్ళ జైలు

- December 28, 2019 , by Maagulf
ఇసుక దొంగతనం: వ్యక్తికి మూడేళ్ళ జైలు

బహ్రెయిన్‌: లోవర్‌ క్రిమినల్‌ కోర్టు, ఓ బహ్రెయినీ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్షను విధించింది. ఇసుకని దొంగతనం చేస్తున్నందుకు, అలాగే స్టోన్స్‌ని దొంగతనం చేస్తున్నందుకు నిందితుడికి జైలు శిక్ష విధించారు. నిందితుడు వాటిని ఓ ప్లాట్‌ నుంచి దొంగిలించి 500,000 బహ్రెయినీ దినార్స్‌కి విక్రయించినట్లు విచారణలో తేలింది. ప్రాపర్టీని లీజ్‌కి తీసుకుని నిందితుడు దొంగతనానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఓనర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేసిన పోలీసులకు విచారణలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఫిర్యాదు చేసే సమయంలోనే నిందితుడు పారిపోగా, అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com