మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో చోరీ!
- December 29, 2019
దివంగత నిర్మాత, మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో చోరీ జరిగింది. గుంటూరు జిల్లా కారంచేడు చిన వంతెన సమీపంలోని ఆయన స్వగృహంలో ఈ దొంగతనం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలు పగలగొట్టి భారీగా నగదు, వెండిని దోచుకెళ్లారని పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆ ఇంట్లో దగ్గుబాటి రామ్మోహన్ రావు దంపతులు నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెలు హైదరాబాద్లో ఉండటంతో తరచూ వెళ్లి వస్తున్నారు. ఇదే క్రమంలో డిసెంబర్ 16న రామ్మోహన్ రావు దంపతులు హైదరాబాద్కు వచ్చారు. ఇక అదే అదనుగా చేసుకుని దొంగలు అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. సుమారు మూడు సవర్ల బంగారంతో పాటుగా 10 కిలోల వెండి, 60 వేల నగదు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది.
శనివారం నాడు ఉదయం ఇంటి పనులు చేసేందుకు వచ్చిన నరసింహారావు దంపతులు.. ఇంటి తాళాలు బద్దలైపోవడం గమనించి ఆఫీస్ మేనేజర్ తాళ్లూరి శ్రీనివాసరావుకు విషయాన్ని చేరవేశారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. కాగా, పోలీసులు హైదరాబాద్లో ఉన్న రామ్మోహన్ రావుకు జరిగిన విషయాన్ని తెలియజేయగా.. సొత్తు ఎంత పోయిందనే పూర్తి వివరాలు వారు వచ్చాక తెలుస్తాయని అంటున్నారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







