రామోజీ ఫిల్మ్ సిటీలో అజిత్ సినిమా షూటింగ్ పూర్తి
- January 03, 2020
అజిత్ ప్రస్తుతం 'వాలిమై' చిత్రం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటూ రాగా..నిన్నటి తో ఈ సినిమా షూటింగ్ ఫిలిం సిటీ లో పూర్తి చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కావడం తో చిత్ర యూనిట్ చెన్నైకి చేరుకున్నారు. తదుపరి షెడ్యూల్ చెన్నైలో జరగనుందని సమాచారం.
అజిత్ గత చిత్రం 'నెర్కొండ పారవై'ను డైరెక్ట్ చేసిన హెచ్.వినోత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో కథానాయకిగా యామీ గౌతమ్ నటించనుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇందులో ఇంకో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. ఆ పాత్ర కొసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానాను తీసుకోవాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







