రామోజీ ఫిల్మ్ సిటీలో అజిత్ సినిమా షూటింగ్ పూర్తి

- January 03, 2020 , by Maagulf
రామోజీ ఫిల్మ్ సిటీలో అజిత్ సినిమా షూటింగ్ పూర్తి

అజిత్ ప్రస్తుతం 'వాలిమై' చిత్రం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటూ రాగా..నిన్నటి తో ఈ సినిమా షూటింగ్ ఫిలిం సిటీ లో పూర్తి చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కావడం తో చిత్ర యూనిట్ చెన్నైకి చేరుకున్నారు. తదుపరి షెడ్యూల్ చెన్నైలో జరగనుందని సమాచారం.

అజిత్ గత చిత్రం 'నెర్కొండ పారవై'ను డైరెక్ట్ చేసిన హెచ్.వినోత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో కథానాయకిగా యామీ గౌతమ్ నటించనుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇందులో ఇంకో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. ఆ పాత్ర కొసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానాను తీసుకోవాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com