మచిలీపట్నం లోని అభిమానులకు నిరాశ మిగిల్చిన మహేష్ బాబు
- January 05, 2020మచిలీపట్నం : సంక్రాంతి సంబురాల పేరిట మచిలీపట్నంలో నిర్వహించిన ఓ టీవీ షోకు వచ్చిన సినీ హీరో మహేష్బాబును చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. టీవీ షోలో పాల్గొనేందుకు మహేష్బాబు మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు శనివారం సాయంత్రం చేరుకున్నారు. కానీ ఇదే సమయంలో వర్షం పడటంతో సంబరాల్లో పాల్గొనకుండానే ఆయన వెనుదిరిగారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికి వర్షం తగ్గింది. రాత్రికి యధావిధిగా టీవీ షో నిర్వహించారు.
కాగా, మహేష్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగటంతో అధిక సంఖ్యలో అభిమానులు ఏజే కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. కానీ మహేష్ బాబు వెళ్లిపోయారని తెలియటంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. కాగా, మహేశ్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు