యూఏఈలో 5 ఏళ్ల మల్టి ఎంట్రీ వీసా...6 నెలలు ఉండేందుకు ఛాన్స్
- January 08, 2020
యూఏఈని గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్ గా డెవలప్ చేయటంలో భాగంగా కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో తొలిసారి సమావేశమైన కేబినెట్ పర్యాటకులకు 5 ఏళ్ల వాలిడిటీతో టూరిస్ట్ వీసా ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ 5 ఇయర్స్ మల్టీపుల్ ఎంట్రీ టూరీస్ట్ వీసాతో ఎన్ని సార్లైనా యూఏఈ విజిట్ చేయవచ్చు. అంతేకాదు ఈ ఐదేళ్లలో ట్రిప్ వెళ్లిన ప్రతీ ఎంట్రీలో 6 నెలలు యూఏఈలో స్టే చేసేందుకు అనుమతి ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన టూరిస్ట్ వీసాల విషయంలో అనుసరించే నిబంధనలనే మల్టీపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా మంజూరులోనూ పాటించనున్నారు. దీంతో ఎలిజిబిలిటీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని అన్ని దేశాల పౌరులకు వీసాలను 5 ఇయర్ వాలిటిడీ మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. యూఏఈలో పర్యాటక రంగాన్ని మరింత డెవలప్ చేయటం, టూరిస్ట్ ఎకానమీ పెంచుకోవటం లక్ష్యంగా కేబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







