అమెరికా దళాల 'ఇరాక్ ఎయిర్ బేస్'పై రాకెట్ల దాడి:మిలిటరీ
- January 12, 2020
ఇరాక్:ఇరాక్లోని బలాడ్ వైమానిక స్థావరంపై జరిగిన రాకెట్ల దాడిలో కనీసం నలుగురు సైనికులు గాయపడినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ప్రాధమిక నివేదికల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ దళాలకు ఆతిథ్యమిస్తున్న ఇరాక్ యొక్క బలాడ్ ఎయిర్ బేస్ లోపల ఆదివారం ఏడు మోర్టార్ బాంబులు పడ్డాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. బాగ్దాద్కు ఉత్తరాన 80 కిలోమీటర్ల (50 మైళ్ళు) దూరంలో ఉన్న బేస్ లోపల ఉన్న రన్వేలో మోర్టార్ బాంబులు పడ్డాయని సైనిక వర్గాలు తెలిపాయి. బలాద్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో కనీసం నలుగురు ఇరాకీ సైనికులు గాయపడ్డారు.
గత రెండు వారాలుగా అమెరికా మరియు ఇరాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బాగ్దాద్కు ఉత్తరాన ఉన్న అల్-బలాద్ ఎయిర్బేస్లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళంలో ఎక్కువ మంది అక్కడినుండి వెళ్లిపోయారని సైనిక వర్గాలు తెలిపాయి. ఇరానియన్ జనరల్ ఖాసిం సులేమాని హత్య తరువాత అమెరికా మరియు ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో యునైటెడ్ స్టేట్స్ దళాలకు ఆతిథ్యమిచ్చే సైనిక స్థావరాలు గత కొద్ది రోజులుగా రాకెట్, మోర్టార్ దాడులకు గురయ్యాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







