అమెరికా దళాల 'ఇరాక్ ఎయిర్ బేస్'పై రాకెట్ల దాడి:మిలిటరీ
- January 12, 2020
ఇరాక్:ఇరాక్లోని బలాడ్ వైమానిక స్థావరంపై జరిగిన రాకెట్ల దాడిలో కనీసం నలుగురు సైనికులు గాయపడినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ప్రాధమిక నివేదికల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ దళాలకు ఆతిథ్యమిస్తున్న ఇరాక్ యొక్క బలాడ్ ఎయిర్ బేస్ లోపల ఆదివారం ఏడు మోర్టార్ బాంబులు పడ్డాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. బాగ్దాద్కు ఉత్తరాన 80 కిలోమీటర్ల (50 మైళ్ళు) దూరంలో ఉన్న బేస్ లోపల ఉన్న రన్వేలో మోర్టార్ బాంబులు పడ్డాయని సైనిక వర్గాలు తెలిపాయి. బలాద్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో కనీసం నలుగురు ఇరాకీ సైనికులు గాయపడ్డారు.
గత రెండు వారాలుగా అమెరికా మరియు ఇరాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బాగ్దాద్కు ఉత్తరాన ఉన్న అల్-బలాద్ ఎయిర్బేస్లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళంలో ఎక్కువ మంది అక్కడినుండి వెళ్లిపోయారని సైనిక వర్గాలు తెలిపాయి. ఇరానియన్ జనరల్ ఖాసిం సులేమాని హత్య తరువాత అమెరికా మరియు ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో యునైటెడ్ స్టేట్స్ దళాలకు ఆతిథ్యమిచ్చే సైనిక స్థావరాలు గత కొద్ది రోజులుగా రాకెట్, మోర్టార్ దాడులకు గురయ్యాయి.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









