ఎం.జి.రామచంద్రన్ జయంతి సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ విడుదల
- January 17, 2020
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న చిత్రం `తలైవి`. బాలీవుడ్క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల చెన్నైలో ప్రారంభమైన ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో దివంగత రాజకీయ నాయకుడు ఎం.జి.రామచంద్రన్ పాత్రలో ప్రముఖ నటుడు అరవింద స్వామి నటిస్తుండగా మరో దివంగత నేత కరుణానిధి పాత్రలో ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు.
ఎం.జి.రామచంద్రరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ లుక్ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన జయలలిత లుక్, టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఎంజీ రామచంద్రన్ లుక్ను యూనిట్ విడుదల చేసింది. అప్పటి ఎంజీఆర్ లుక్లో అరవింద స్వామి ఒదిగిపోయారు.డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలే్ ఆర్.సింగ్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







