ఇండియన్‌ స్కూల్స్‌కి ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ 21 నుంచి ప్రారంభం

- January 18, 2020 , by Maagulf
ఇండియన్‌ స్కూల్స్‌కి ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ 21 నుంచి ప్రారంభం

మస్కట్‌: మస్కట్‌లో తల్లిదండ్రులు, తమ విద్యార్థుల్ని కెజి 1 నుంచి గ్రేడ్‌ ఎలెవన్‌ వరకు చేర్చేందుకోసం ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌కి రిజిస్టర్‌ చేసుకోవాల్సి వుంటుంది. 2020-21 సంవత్సరానికిగాను ఈ అడ్మిషన్లు 21 జనవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు అందుబాటులో వుంటాయి. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్కూల్స్‌ ఇన్‌ సుల్తానేట్‌ ఆఫ్‌ ఒమన్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేససింది. ఫిబ్రవరి 20వ తేదీతో రిజిస్ట్రేషన్లు ముగుస్తాయనీ, ఎవరైనా ఈ తేదీ లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. క్యాపిటల్‌ ఏరియాలో మొత్తం ఏడు ఇండియన్‌ స్కూల్స్‌కి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ వర్తిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com