బీజేపీ కొత్త సారథి జె.పీ.. నడ్డా
- January 20, 2020బీజేపీ జాతీయ అధ్యక్షునిగా జె.పీ.నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఢిల్లీ లోని పార్టీ ప్రధానకార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయనకు నియామకపత్రాలను పార్టీ ఎన్నికల ఇన్-ఛార్జ్ రాధామోహన్ సింగ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, తెలంగాణ నుంచి డా.కె.లక్ష్మణ్, ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుమారు ఏడాది క్రితం నడ్డా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి విదితమే.. కాగా-తనపై తాజాగా పార్టీ అధినాయకత్వం పెట్టిన బాధ్యతలను తాను సమర్థవంతంగా నిర్వహిస్తానని నడ్డా పేర్కొన్నారు. ఆయనను పార్టీ మాజీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర సీనియర్ నేతలు అభి నందించారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం