లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- May 12, 2024
హైదరాబాద్: తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవిగుప్తా అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లోక్సభ 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు చేసాం…7 వేల మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు చేసామని పేర్కొన్నారు. 89 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్పోస్టులు, 173 అంతర్జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, రూ.186కోట్ల విలువచేసే మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు నమోదు చేశామని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కేంద్ర బలాలతో భద్రత ఏర్పాటు చేసామని డీజీపీ రవి గుప్త వివరించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!