దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- May 12, 2024
దుబాయ్: ప్రస్తుతం దుబాయ్లో ఉన్న 2022లోని మినిస్టీరియల్ రిజల్యూషన్ ప్రకారం.. యూఏఈలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి గోల్డెన్ రెసిడెన్సీ వీసాకు అర్హులు. అదే విధంగా గోల్డెన్ వీసాను కలిగి ఉన్న ఉద్యోగిని నియమించుకోవాలనుకునే కంపెనీ మంత్రిత్వ శాఖ నుంచి తగిన పర్మిట్ ను పొందాల్సి ఉంటుంది. అయితే, గోల్డెన్ రెసిడెన్సీ వీసా పొందకుముందు ఒక ఉద్యోగి అతని లేదా ఆమె యూఏఈ రెసిడెన్సీ వీసాలో మార్పు గురించి యజమానికి తెలియజేయాలి. ప్రస్తుత వర్క్ పర్మిట్ను రద్దు చేయాలి. దానితోపాటు వారి రెసిడెన్సీ వీసాను రద్దు చేయాలి. ఆ తర్వాతనే కొత్త ఉద్యోగ ఒప్పందంపై సంతకం చేయాలి. 2022 యొక్క అడ్మినిస్ట్రేటివ్ రిజల్యూషన్ నం. 38కి అనుగుణంగా యూఏఈ గోల్డెన్ రెసిడెన్సీ వీసా హోల్డర్ కోసం మానవ వనరులు మరియు ఎమిరిటైజేషన్ (MoHRE) మంత్రిత్వ శాఖ ద్వారా వర్క్ పర్మిట్ పొందవలసి ఉంటుంది. అందుకోసం చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ (గోల్డెన్) వీసా కాపీ, మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆమోదించబడిన ఉద్యోగ ఒప్పందం, అకడమిక్ సర్టిఫికెట్లతో దరఖాస్తు సమర్పించాలని మార్కెట్ నిపుణులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









