'ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్' అందుకున్న అల్లు అరవింద్
- January 20, 2020ఢిల్లీ:ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ను భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న అల్లు అరవింద్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అందరికీ సుపరిచితమే. ఆయన చిత్రాలకు ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అల్లు అరవింద్ తెలుగులో కాకుండా తమిళ, హిందీ, కన్నడ భాషల్లో చిత్రాలను నిర్మించారు. రజినీకాంత్, చిరంజీవి, అనిల్ కపూర్, గోవిందా, అమీర్ ఖాన్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలతో ఆయన చిత్రాలు తీశారు.
అలాంటి అల్లు అరవింద్ సినిమాకు చేసిన సేవలకుగానూ 'ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ 2019'కి ఎంపికయ్యారు. ఈరోజు (సోమవారం) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 'ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ 2019'ని అల్లు అరవింద్కు ప్రదానం చేశారు. సోషియల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనిటీ సర్వీస్ చేసిన వారికి ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డ్స్ను ఈ ఏడాది నలుగురు ముఖ్యమంత్రులు, కొంతమంది స్పోర్ట్స్ ఛాంపియన్స్ అరవింద్తో పాటు స్వీకరించబోతున్నారు. సినిమా రంగానికి చెందిన వ్యక్తి కేటగిరీలో అల్లు అరవింద్ ఈ అవార్డ్ అందుకోవడం విశేషం.
తాజా వార్తలు
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ