3 రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

- January 20, 2020 , by Maagulf
3 రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

అమరావతి:మూడు రాజధానుల బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదించింది. అసెంబ్లీలో ఈ బిల్లుపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. ఏపీ సీఎం జగన్ ప్రసంగం తర్వాత ఈ బిల్లుకు మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు చెప్పారు. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో శాసనసభ, విశాఖలో సచివాలయం, రాజ్ భవన్, హెచ్‌వోడీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com