నేపాల్‌లో హిమపాతం

- January 21, 2020 , by Maagulf
నేపాల్‌లో హిమపాతం

ఖాట్మండ్‌ : నేపాల్‌లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా మంచు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ప్రధానంగా నేపాల్‌లోని పర్వత శిఖరాలను అధిరోహిం చేందుకు వచ్చిన పర్వతారోహకులు ఇబ్బందిపడుతున్నారు. నలుగురు దక్షిణకొరియా ట్రెక్కర్లు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వీరంతా అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించేందుకు ఇక్కడికి వచ్చారని అన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ల సాయంతో వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. వీరితో పాటు ముగ్గురు నేపాలీ గైడ్లు కూడా గల్లంతయ్యారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com