విజయవాడ నుండి గల్ఫ్ దేశాలకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ కొత్త సర్వీసు
- January 25, 2020
విజయవాడ:ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరోక్ష కృషి కారణంగా ఎయిరిండియా ఎక్స్ప్రెస్ కొత్త సర్వీసుకు శ్రీకారం చుట్టింది. దోహా, షార్జాలకు విమాన సర్వీసులను (ముంబయి అనుసంధానంతో) నడపాలని నిర్ణయించింది. ఆయా దేశాలకు విమాన సర్వీసులను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ వెబ్ బుకింగ్ పోర్టల్ను సిద్ధం చేసింది. ఈ రెండు దేశాలు వెళ్లే ప్రయాణికులు విజయవాడ నుంచే బయల్దేరవచ్చు. వారంలో మంగళ, బుధ, శనివారాల్లో ఈ సర్వీసు నడుస్తుంది. ప్రయాణికుల సెక్యూరిటీ చెక్ ఇన్ విజయవాడ విమానాశ్రయంలోనే నిర్వహిస్తారు. ఆయా దేశాలకు వెళ్లే ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లు కూడా ఇక్కడే ఇస్తారు. లగేజీని హ్యాండోవర్ చేస్తే చాలు.. విమానంలో ఎక్కి కూర్చోవటమే. కస్టమ్స్, ఇమిగ్రేషన్ చెక్ ఇన్ మాత్రం ముంబయి విమానాశ్రయంలో ఉంటుంది.
చౌక విదేశీ ప్రయాణం
ఈ రోజు నుంచి ప్రారంభంకానున్న దోహా, షార్జా సర్వీసుల్లో చౌకగా ప్రయాణించవచ్చు. విజయవాడ నుంచి షార్జాకు వాల్యూ ప్యాక్ కింద రూ.10,819 ధరగా నిర్ణయించారు. అదే ఫ్లెక్సీ ప్యాక్ కింద అయితే రూ.34,339 నిర్ణయించారు. విజయవాడ నుంచి దోహాకు వాల్యూ ప్యాక్ కింద అయితే రూ.12,815, ఫ్లెక్సీ ప్యాక్ కింద అయితే రూ.49,565 నిర్ణయించారు. ఈ రోజు ప్రయాణానికి అప్పుడే టికెట్లు అయిపోవడం విశేషం.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







