ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం...

- January 27, 2020 , by Maagulf
ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం...

ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 83 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. తాలిబన్లు ఆధీనంలో ఉన్న సెంట్రల్ ఘాజ్నీ ప్రావిన్స్ లోని దేహ్ యాక్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం గం.1-15 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈఫ్రమాదంలో మరిణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. విమానం ఏదైనా సాంకేతిక కారణాలతో కూలిందా...లేక తాలిబన్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది.

మొదట కూలిన విమానం ఆఫ్గాన్ కు చెందిన ఏరియానా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంగా వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తలను ఏరియానా విమానయాన సంస్ధ కొట్టి పారేసింది. తమ విమానాలన్నీ బాగానే తిరుగుతున్నాయని వేటికీ ప్రమాదం జరగలేదని ప్రకటించింది. ఈ రోజు తాము రెండు విమానాలను నడిపామని ఏరియానా సంస్థ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com