ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం...
- January 27, 2020
ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 83 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. తాలిబన్లు ఆధీనంలో ఉన్న సెంట్రల్ ఘాజ్నీ ప్రావిన్స్ లోని దేహ్ యాక్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం గం.1-15 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈఫ్రమాదంలో మరిణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. విమానం ఏదైనా సాంకేతిక కారణాలతో కూలిందా...లేక తాలిబన్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది.
మొదట కూలిన విమానం ఆఫ్గాన్ కు చెందిన ఏరియానా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంగా వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తలను ఏరియానా విమానయాన సంస్ధ కొట్టి పారేసింది. తమ విమానాలన్నీ బాగానే తిరుగుతున్నాయని వేటికీ ప్రమాదం జరగలేదని ప్రకటించింది. ఈ రోజు తాము రెండు విమానాలను నడిపామని ఏరియానా సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







