తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో కువైట్ లో ఘనంగా ఎన్.టి.ఆర్ 20వ వర్ధంతి

- January 19, 2016 , by Maagulf

కువైట్ లోని తెలుగు దేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు గారి ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో పెద్ద సంఖ్యలో తెలుగు దేశం కార్యకర్తలు, నందమురి మరియు నారా అభిమానులు, పరిటాల యువ సేన, తెలుగు యువత, ఎన్.టి.ఆర్. సేవాదల్, నారా లోకెష్ సేవాసమితి  నాయకులు  పాలు పంచుకొన్నారు. 
తెలుగు దేశం కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు గారు, ప్రధాన కార్యదర్శి యేగి వెంకటేష్ నాయుడు గారు, గల్ఫ్ వైడ్ నందమురి ఫ్యాన్స్  అధ్యక్షులు శాంతారాం నాయుడు గారు, ఎన్.టి.ఆర్  సేవాదల్ అధ్యక్షులు కోటేశ్వర నాయుడు గారు, పరిటాల యువసేన నాయకులు చంద్ర బాబు గారు, నారా లొకెష్ సేవాసమితి అధ్యక్షులు పట్టాభి నాయుడు గారు, ముధిరాజ్ సంఘం అధ్యక్షులు బొమ్ము నరసిమ్హ గారు, కువైట్ తెలుగు దేశం మైనారిటీ సంఘం నాయకులు షేక్ బాషా గారు,నవ్యాంధ్ర తెలుగు దేశం అధ్యక్షులు నాగేంద్ర బాబు గారు, ప్రముఖ నాయకులు కొత్తపల్లి మోహన్ బాబు గారు, రాజేష్ కుమార్ గారు మరియు ఇంకా ఎందరో ప్రముఖులు రామారావు గారికి నివాళులు అర్పించి వారు తెలుగు వారికి చేసిన సేవలను కొనియాడారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com