తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో కువైట్ లో ఘనంగా ఎన్.టి.ఆర్ 20వ వర్ధంతి
- January 19, 2016
కువైట్ లోని తెలుగు దేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు గారి ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో పెద్ద సంఖ్యలో తెలుగు దేశం కార్యకర్తలు, నందమురి మరియు నారా అభిమానులు, పరిటాల యువ సేన, తెలుగు యువత, ఎన్.టి.ఆర్. సేవాదల్, నారా లోకెష్ సేవాసమితి నాయకులు పాలు పంచుకొన్నారు.
తెలుగు దేశం కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు గారు, ప్రధాన కార్యదర్శి యేగి వెంకటేష్ నాయుడు గారు, గల్ఫ్ వైడ్ నందమురి ఫ్యాన్స్ అధ్యక్షులు శాంతారాం నాయుడు గారు, ఎన్.టి.ఆర్ సేవాదల్ అధ్యక్షులు కోటేశ్వర నాయుడు గారు, పరిటాల యువసేన నాయకులు చంద్ర బాబు గారు, నారా లొకెష్ సేవాసమితి అధ్యక్షులు పట్టాభి నాయుడు గారు, ముధిరాజ్ సంఘం అధ్యక్షులు బొమ్ము నరసిమ్హ గారు, కువైట్ తెలుగు దేశం మైనారిటీ సంఘం నాయకులు షేక్ బాషా గారు,నవ్యాంధ్ర తెలుగు దేశం అధ్యక్షులు నాగేంద్ర బాబు గారు, ప్రముఖ నాయకులు కొత్తపల్లి మోహన్ బాబు గారు, రాజేష్ కుమార్ గారు మరియు ఇంకా ఎందరో ప్రముఖులు రామారావు గారికి నివాళులు అర్పించి వారు తెలుగు వారికి చేసిన సేవలను కొనియాడారు.
_1453231889.jpg)

_1453231857.jpg)
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







