ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆహ్వానం-బాబు

- January 19, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆహ్వానం-బాబు

వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూరప్‌ తెలుగు సమాజానికి పిలుపునిచ్చారు. విదేశీ గడ్డపై ఇప్పటికే విజయబావుటా ఎగురవేసిన తెలుగువారు తమ అనుభవాలను, సాధించిన విజయాలను జన్మభూమి అభివృద్ధికి అందించాలని కోరారు. యూరోపియన్‌ దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తమ విధానాలు, పద్ధతులతో నవ్యాంధ్ర అభివృద్ధికి బాటలు వేయొచ్చని సీఎం ఆకాంక్షించారు. స్విట్జర్లాండ్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక 46వ సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వెళ్లేముందుకు జ్యురిచ్‌లో కొన్ని గంటల పాటు చంద్రబాబు గడిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com