త్రిభాషా చిత్రాన్ని‘హథీ మేరే సాథి’, ‘కాండన్', ‘అరణ్య’గా విడుదల చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల్
- February 10, 2020
దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్.. వైవిధ్యమైన కథా చిత్రాలకు అండగా నిలబడుతూ ఇండియన్ సినిమాను భవిష్యత్తులో అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది. సోమవారం మూడు భాషల్లో రూపొందిన సినిమా ‘హథీ మేరే సాథి’, ‘కాండన్’, ‘అరణ్య’ సినిమాల పోస్టర్స్ను సోమవారం ఈరోస్ సంస్థ విడుదల చేసింది. ఈ సందర్భంగా..
ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ సునీల్ లుల్లా మాట్లాడుతూ - “ఈసినిమాకు మూడు టైటిల్స్తో మూడు భాషల్లో విడుదల చేస్తున్నాం. మా బ్యానర్కు చాలా స్పెషల్ మూవీగా భావిస్తున్నాం. యూనిక్ స్టోరీ లైన్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది” అన్నారు.
చిత్ర దర్శకుడు ప్రభు సాల్మన్ మాట్లాడుతూ “హృదయానికి హత్తుకునేలా మావటివాడు, ఏనుగుకి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసే ఎమోషనల్ డ్రామానే ఈ చిత్రం. మానవజాతి కజిరంగ, అస్సోమ్ ప్రాంతాల్లోని ఏనుగుల అవాస ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటున్నారు. దీని వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అడవిలోనే ఉంటూ తన జీవితాన్ని అడవి, అందులో జంతు సంరక్షణకు ఓ వ్యక్తి ఏం చేశాడనే కాన్సెప్ట్తో ఈ సినిమా ఉంటుంది. రానా దగ్గుబాటి ఈ సినిమాలో ఆ పాత్రను అద్భుతంగా పోషించారు. ఈ సినిమాను చాలా ఎగ్జయిట్మెంట్తో తెరకెక్కించాం. ప్రేక్షకులను మెప్పించేలా మూడు భాషల్లో సినిమాను తెరకెక్కించాం” అన్నారు.
జంతు ప్రేమికుడు, జాతీయ అవార్డ్ గ్రహీత ప్రభు సాల్మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘లైఫ్ ఆఫ్ పై’, ‘థోర్’, ‘బై మోక్ష్ బక్షి’ వంటి చిత్రాలకు వి.ఎఫ్.ఎక్స్ అందించిన ప్రాణ స్టూడియో ఈ సినిమాకు వి.ఎఫ్.ఎక్స్ చేస్తుంది. ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’, ‘పింక్’, ‘వజీర్’ చిత్రాలకు సంగీతాన్ని అందించిన శాంతను మోయిత్ర ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత రసూల్ పూకుట్టి ఈ చిత్రానికి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







