లేబర్ డ్యూస్ పరిష్కారం: ఆరేళ్ళలో 42.3 మిలియన్ దిర్హామ్లు
- January 20, 2016
యూఏఈ లేబర్ మినిస్ట్రీ గడచిన ఆరేళ్ళలో 42.3 మిలియన్ దిర్హామ్ల సెటిల్మెంట్లను చేసింది. 40 కంపెనీలకు సంబంధించి 13,616 మంది కార్మికుల సమస్యలను పరిష్కరించారు. కమిట్మెంట్కి తగ్గట్టుగా చెల్లింపులు చేయని సంస్థలకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీలను లాక్ చేసిన మంత్రిత్వ శాఖ, 2010 నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు చేపడుతూ వచ్చింది. 8,493 మంది కార్మికులు బ్యాంక్ గ్యారంటీస్ సెటిల్మెంట్ నుంచి లాభపడ్డారనీ, వారంతా తిరిగి సొంత దేశాలకు వెళ్ళేందుకు సుముఖత వ్యక్తం చేశారనీ, 5,123 మంది తమ బకాయిల చెల్లింపుతో, ఇతర సంస్థల వైపు మొగ్గు చూపారనీ, మినిస్ట్రీ వారికి వర్క్ పర్మిట్స్ మంజూరు చేసిందని అధికారులు చెప్పారు. వేతనాల చెల్లింపు విషయంలో మంత్రిత్వ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందనీ, ఎలాంటి అక్రమాలకు తావివ్వదని మంత్రిత్వ శాఖ ప్రతినిథులు వివరించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







