హార్దిక్ పటేల్ మిస్సింగ్..! ఇది బీజేపీ కుట్రే అంటున్న భార్య
- February 14, 2020పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కనిపించకుండా పోయాడట... దాదాపు 20 రోజుల నుంచి ఆయన కనిపించడం లేదట.. ఈ మేరకు ఆయన భార్య కింజాల్ పటేల్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. తన భర్తను గుజరాత్ పాలకులు టార్గెట్ చేశారని.. దీంతో, 20 రోజులుగా ఆయన ఆచూకీ తెలియడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాటిదార్ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను తిరగతోడి తన భర్త ఒక్కడినే టార్గెట్ చేశారని ఆమో వీడియోలో ఆరోపించారు.. గతంలో పాటిదార్ ఉద్యమంలో పనిచేసిన మరో ఇద్దరు.. బీజేపీలో చేరడంతో వారిపై కేసులు ఎత్తివేశారని.. కానీ, ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న హార్దిక్ పటేల్ను వదలడంలేదన్నారు. ఇక, రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హార్థిక్ పటేల్ ను జైలుకు పంపించేందుకు గుజరాత్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు కింజాల్ పటేల్.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం