బహ్రెయిన్: ఫైనల్ ఫిటీషన్ ఛాన్స్ కొల్పోయిన టెర్రరిస్ట్ గ్రూప్..యావజ్జీవ శిక్ష ఖరారు
- February 14, 2020
బహ్రెయిన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న 12 మందికి గతంలో విధించిన శిక్షలు ఖరారయ్యాయి. గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ ను కోర్ట్
ఆఫ్ కసెషన్ కొట్టివేసింది. దీంతో శిక్ష నుంచి తప్పించుకునేందుకు టెర్రరిస్ట్ గ్యాంగ్ కు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. టెర్రరిస్ట్ సెల్ ఏర్పాటు తో పాటు కిడ్నాప్, టార్చరింగ్, దేశంలో టెర్రరిస్ట్ ప్రమోషన్ కు సాయం అందించటం, దోపిడి, వేధింపులు ఇలా పలు రకాల అభియోగాలతో 12 మందికి గతంలో శిక్షలు ఖరారయ్యాయి. ఇందులో ఇద్దరికి యావజ్జీవ కారగార శిక్ష పడగా 8 మందికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష పడింది. కోర్టులో రికార్డులు ప్రకారం..12 మంది కలిసి 'సిక్రెట్ ఇంటలిజెన్స్ సర్వీస్ ఆఫ్ బహ్రెయిన్ రెవల్యూషన్' పేరుతో టెర్రరిస్ట్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. యువతను ఉగ్రవాదం వైపు అకర్షించేలా ప్రేరేపించటంతో పాటు పలు అరాచకాలకు పాల్పడుతూ వస్తున్నారు. ముఖ్యంగా పోలీసులకు సహకరించే వ్యక్తులను టార్గెట్ చేసేవారు. వారిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేయటంతో పాటు ఫ్యూచర్ లో పోలీసులకు సహకరించొద్దని బెదిరించేవారు. ఉగ్రవాదానికి అనుకూలించేలా వారితో కన్ఫెక్షన్ చెప్పించేవారని ఆరోపణలు ఉన్నాయి. వేర్వేరు ఘటనల్లో పోలీసులకు కోఅపరేట్ చేసే నలుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి టార్చర్ చేసినట్లు పోలీసుల ఇన్వేస్టిగేషన్ లో తేలింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!