టైగర్ఎయిర్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్..
- January 20, 2016
సింగపూర్కు చెందిన చౌకధర విమానయాన సంస్థ టైగర్ఎయిర్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి సింగపూర్ రానుపోను టికెట్ ధరను రూ.11,599గా నిర్ణయించింది. ఈ ప్రత్యేక ఆఫర్ పరిధిలోకి రావాలంటే ప్రయాణికుడు ఈ నెల 31లోపు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బుకింగ్ చేసుకున్న వారు మార్చి 9 నుంచి ఏప్రిల్ 16 లోపు ప్రయాణం చేయాల్సి ఉంటుందని కంపెనీ డైరెక్టర్ చౌహన్ తెలిపారు. అన్ని పన్నులు కలుపుకొని టికెట్ ధరను నిర్ణయించినట్లు, ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. సింగపూర్ను సందర్శించే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో సంస్థ మరో రెండు నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.ఏప్రిల్ 25 నుంచి జూన్ 15 మధ్యకాలంలో హైదరాబాద్, తిరుచిరాపల్లి నుంచి వారానికి ఒక సర్వీసును నడుపనున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









