టైగర్ఎయిర్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్..
- January 20, 2016
సింగపూర్కు చెందిన చౌకధర విమానయాన సంస్థ టైగర్ఎయిర్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి సింగపూర్ రానుపోను టికెట్ ధరను రూ.11,599గా నిర్ణయించింది. ఈ ప్రత్యేక ఆఫర్ పరిధిలోకి రావాలంటే ప్రయాణికుడు ఈ నెల 31లోపు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బుకింగ్ చేసుకున్న వారు మార్చి 9 నుంచి ఏప్రిల్ 16 లోపు ప్రయాణం చేయాల్సి ఉంటుందని కంపెనీ డైరెక్టర్ చౌహన్ తెలిపారు. అన్ని పన్నులు కలుపుకొని టికెట్ ధరను నిర్ణయించినట్లు, ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. సింగపూర్ను సందర్శించే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో సంస్థ మరో రెండు నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.ఏప్రిల్ 25 నుంచి జూన్ 15 మధ్యకాలంలో హైదరాబాద్, తిరుచిరాపల్లి నుంచి వారానికి ఒక సర్వీసును నడుపనున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







