షార్జా:పనిమనిషిని చంపేస్తానని బెదిరింపులు..
- February 15, 2020
షార్జా:షార్జాలో కన్నకొడుకునే పోలీసులకు పట్టించాడు ఓ తండ్రి. ఇంట్లో పని చేసే మహిళను చంపేస్తానని బెదిరించటంతో ఆ తండ్రి పోలీసులకు ఫోన్ చేసి కొడుకు నిర్వాకంపై కంప్లైంట్ చేశాడు. దీంతో షార్జా పాట్రోలింగ్ పోలీసులు 38 ఏళ్ల జీసీసీ నేషనల్ వ్యక్తని అదుపులోకి తీసుకుంది. అతనిపై బెదిరింపు అభియోగంతో పాటు పోలీస్ పాట్రోలింగ్ కార్ ను డ్యామేజ్ చేసినందుకు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కేసును కూడా నమోదు చేశారు.
పోలీసులు విచారణలో నిజం ఒప్పుకున్న నిందతుడు..తన నాలుగేళ్ల కూతర్ని కొట్టినందుకే తనకు కోపం వచ్చిందన్నాడు. కూతుర్ని కొట్టిన పనిమనిషిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమెకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. దీంతో వణికిపోయిన ఆమె..నిందితుడి తండ్రికి విషయం చెప్పింది. వెంటనే అతను కొడుకుపై పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించటంతో..పోలీసులు పాట్రోలింగ్ టీంను పంపించారు. అయితే..పాట్రోలింగ్ టీం చేరుకునే సమయానికే తాను తన తండ్రి ఇంట్లో పనిమనిషి కోసం కత్తితో పాటు ఎదురుచూస్తున్నట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. తండ్రి కారుతో పాటు పోలీస్ పాట్రోలింగ్ వాహనం కూడా వస్తుండటం గమనించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో పోలీస్ కారును ఢికొట్టడంతో కార్ డ్యామేజ్ అయ్యింది. చివరికి ఎలాగోలా నిందితుడ్ని అరెస్ట్ చేసి..అతడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







