పసిడి ధర పెరిగింది..

- January 21, 2016 , by Maagulf
పసిడి ధర పెరిగింది..

డిమాండు పెరగడంతో గురువారం పసిడి ధర పెరిగింది. రూ.210 పెరగడంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.26,900కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,104.02 అమెరికన్‌ డాలర్లకు చేరింది. వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. రూ.250 పెరగడంతో కేజీ వెండి ధర రూ.34,650కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com