ఎన్ఐఏ అధికారులు అధీనంలో ఏడుగురు ఐసిస్ సానుభూతిపరులు
- January 22, 2016
ఒకే రోజు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏడుగురు ఐసిస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకొని కుట్రలు చేస్తున్న వీరి ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ లో నలుగురు ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అధికారులు తమ అధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు.మరోవైపు కర్ణాటక పోలీసులు, ఎన్ఐఏ అధికారుల జాయింట్ ఆపరేషన్ లో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను శుక్రవారం ఉదయం బెంగళూరులో అరెస్ట్ చేశారు. నజ్ముల్ హుడా, హస్సేన్ లను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. నజ్ముల్, హస్సేన్ కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు కొన్ని రోజులు వీరిద్దరిపై నిఘా ఉంచారు. రిపబ్లిక్ వేడుకల్లో దాడులు చేసేందుకు కుట్రపన్నుతున్నారన్న అనుమానంతో వీరిని తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.బజ్పేలో నివాసముంటున్న నజ్ముల్ హుడా-మంగళూర్ లో కెమికల్ ఇంజినీరింగ్, తుంకుర్ కు చెందిన సయ్యద్ హుస్సేన్- బెంగళూరులో డిప్లొమా చేస్తున్నారు. మహారాష్ట్రలోనూ ఒక ఐసిస్ సానుభూతి పరుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని మంబై ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







