ఢిల్లీ: భారత్ లోకి కరోనా..హైదరాబాద్, ఢిల్లీలో పాజిటీవ్ కేసులు

- March 02, 2020 , by Maagulf
ఢిల్లీ: భారత్ లోకి కరోనా..హైదరాబాద్, ఢిల్లీలో పాజిటీవ్ కేసులు

కరోనా మహమ్మారి తెలంగాణలోకి ఎంటరైంది. ఇన్నాళ్లు ఏదీ జరగకూడదని భావించారో ఆ పెను ముప్పు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్-19 వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యవైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఐదుగురికి కోవిడ్‌-19 పరీక్షలు జరపగా నలుగురికి నెగిటివ్‌గా తేలగా.. ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపింది.  అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా కోవిడ్-19 పాజిటీవ్ కేసు నమోదయ్యింది. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. దీంతో భారత్ లో ఇప్పటివరకు కోవిడ్-19 పాజిటీవ్ కేసుల సంఖ్య ఐదుకు పెరిగింది. గతంలో కేరళలో ముగ్గురికి కరోనా వైరస్ సోకగా..చికిత్స తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. ఆ తర్వత దేశంలో కరోనా వైరస్ కేసులు ఏమి లేకపోవని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో లేటెస్ట్ గా రెండు కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ కు కూడా కరోనా వ్యాప్తి చెందటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com