దుబాయ్ లో ఆగిన మరో గల్ఫన్న గుండె
- March 02, 2020
తెలంగాణ లోని బొమ్మన గ్రామం, కథలాపూర్ మండలం, జగిత్యాల జిల్లా కు చెందిన పాలెపు రాకేష్ అనే కార్మికుడు పొట్ట చేత పట్టుకొని దుబాయ్ వచ్చి బతుకీడుద్దామన్న సమయంలో గత వారం క్రితం ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున హాస్పిటల్లో అడ్మిట్ అయి చికిత్స పోందుతు గత నెల 27 వ తారీకున మరణించడం జరిగింది. ఇట్టి విషయాన్ని తన తోటి కార్మికులు మరియు భందువులు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండెల్లి నర్సింహా కి తెలపడంతో వేంటనే వెళ్లి అన్ని పనులు దగ్గరుండి పూర్తి చేయించి నిన్న రాత్రి మృతదేహాన్ని ఇండియా పంపించడం జరిగింది. మరియు హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి వారి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది. బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే గల్ఫ్ కార్మికుల చిరకాల వాంఛ అయిన TNRI పాలసీని వెంటనే అమలు చేయాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి నుండి వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండెల్లి నర్సింహా , ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, దొనకంటి శ్రీనివాస్, పవన్ కుమార్, కనకట్ల రవీందర్,షేక్ వల్లి, మునిందర్, అశోక్ రెడ్డి, కట్ట రాజు, రాయిల్ల మల్లేశం, శరత్ గౌడ్,జవ్వాజి శంకర్, జవ్వాజి జలందర్,జవాజి శైలేష్,జవ్వాజి చంద్రశేఖర్, బోండ్ల బాలు ,ఏల్లాల గంగారెడ్డి, పాలేపూ శ్రీనివాస్,పాలేపూ వినీష్, పాలేపూ రమేష్, వేల్మల్ సత్యనారాయణ, రాజు పక్కల, గంధం మహేష్, రఘు, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, పేనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భుమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్, సాయి మరియు సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







