ఢిల్లీ: భారత్ లోకి కరోనా..హైదరాబాద్, ఢిల్లీలో పాజిటీవ్ కేసులు
- March 02, 2020
కరోనా మహమ్మారి తెలంగాణలోకి ఎంటరైంది. ఇన్నాళ్లు ఏదీ జరగకూడదని భావించారో ఆ పెను ముప్పు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్-19 వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యవైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐదుగురికి కోవిడ్-19 పరీక్షలు జరపగా నలుగురికి నెగిటివ్గా తేలగా.. ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా కోవిడ్-19 పాజిటీవ్ కేసు నమోదయ్యింది. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. దీంతో భారత్ లో ఇప్పటివరకు కోవిడ్-19 పాజిటీవ్ కేసుల సంఖ్య ఐదుకు పెరిగింది. గతంలో కేరళలో ముగ్గురికి కరోనా వైరస్ సోకగా..చికిత్స తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. ఆ తర్వత దేశంలో కరోనా వైరస్ కేసులు ఏమి లేకపోవని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో లేటెస్ట్ గా రెండు కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ కు కూడా కరోనా వ్యాప్తి చెందటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







