కరోనా కంట్రోల్ లోనే ఉంది..ప్రెస్ మీట్ లో కువైట్ హెల్త్ మినిస్ట్రి వెల్లడి
- March 04, 2020కువైట్:కువైట్ లో కరోనా వైరస్ ప్రభావం అదుపులోనే ఉందని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని ప్రెస్ మీట్ లో హెల్త్ మినిస్ట్రి అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ బుతైన అల్ ముదఫ్ వెల్లడించారు. ప్రస్తుతం కువైట్ లో 56 మందికి కరోనా పాజిటీవ్ గా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఆమె తెలిపారు. అయితే..కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు కువైట్ చేపట్టిన చర్యలను ఈజిప్ట్ మీడియా విమర్శించటాన్ని ఆమె తప్పుబట్టారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈజిప్ట్ నుంచి విమానాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించామని వివరించారు. ఈ ఆంక్షలు ఒక్క ఈజిప్ట్ కు మాత్రమే కాదని సిరియా, ఇండియా, బంగ్లాదేశ్ ఫ్లైట్స్ పై కూడా ఆంక్షలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈజిప్ట్ విమానాలను అడ్డుకోవటంగానీ, అక్కడి నుంచి తమ వారిని వెనక్కి రప్పించటంగానీ చేయటం లేదని..వైరస్ పోరాటంలో తప్పనిసరి పరిస్థితుల కారణంగా ఆంక్షలు విధించాల్సి వచ్చిందని వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్