కేంద్రం కానుక
- January 23, 2016
తెలంగాణకు భారీ పెట్టుబడులు రాబోతున్నాయి.. జాతీయ పెట్టుబడులు, మాన్యుఫాక్చరింగ్ జోన్ల కింద కేంద్రం నాలుగు పారిశ్రామిక వాడలకు కేంద్రం అనుమతులు మంజూరుచేసింది.. మెదక్ జిల్లాలో 60వేల కోట్ల టర్నోవర్తో... 2లక్షల 61వేలమందికి ఉపాది కల్పించే లక్ష్యంతో.. ఈ పారిశ్రామిక వాడ నిర్మించబోతున్నారు.. ఇందులో పలు కంపెనీలు తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నాయి.. పాశమైలారం పారిశ్రామికవాడలో పాడి ప్రాసెసింగ్ క్లస్టర్ పాశమైలారం పారిశ్రామికవాడలో పాడి ప్రాసెసింగ్ క్లస్టర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ సరిహద్దుల్లో ఫార్మా వాడను నెలకొల్పేందుకు కేంద్రం అనుమతులిచ్చింది.
ఈ ప్రాజెక్ట్ రూ. 45,000 కోట్ల పెట్టుబడులతో 2.25 లక్షల మందికి ఉపాధి లభించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. పసుపు బోర్డు , స్పైసెస్ బోర్డు , పార్క్ ఏర్పాటుపై కేంద్రానికి లేఖ పసుపు బోర్డు, స్పైసెస్ బోర్డు, పార్క్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పనుపు బోర్టు ఏర్పాటును సానుకూలంగా స్పందించిన కేంద్రం స్పైసెస్ పార్క్ ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే ఇతర పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది.ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సెజ్ ల ఏర్పాటుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఇప్పుడు మరో నాలుగు పారిశ్రామిక వాడలకు అనుమతులు లభించాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







