కరోనా ఎఫెక్ట్:ఇండియాకు ప్రయాణాన్ని ఎవైడ్ చేయండి..యూఏఈ ఎంబసీ అడ్వైజ్
- March 12, 2020
యూఏఈ పౌరులు ఎవరు భారత్ కు వెళ్లవద్దని ఆ దేశ ఎంబసీ సూచించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించటంతో భారత్ లోని యూఏఈ ఎంబసీ ఈ ప్రకటన చేసింది. ఇదిలాఉంటే..కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం అన్ని దేశాల నుంచి టూరిస్టు వీసాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 12 అర్థరాత్రి నుంచి ఏప్రిల్ 15 వ తేదీ వరకూ ఇది అమల్లో ఉంటుందని భారత ప్రభుత్వం తెలిపింది. ఓసీఐ కార్డ్ హోల్డర్లకు ఉన్న వీసా ఫ్రీ నిబంధన సహా, అధికారిక వీసాలు, డొప్లొమాటిక్ వీసాలు, ఐరాస సంస్థల ప్రతినిధులకు సంబంధించిన వీసాలు, ఉద్యోగ, ప్రాజెక్టులకు సంబంధించిన వీసాలు మినహా ఇతర వీసాలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. విదేశాల నుంచి వస్తున్న వారందరూ తప్పనిసరిగా 14 రోజుల ఐసోలేషన్ ఉండాలని సూచించింది. ముఖ్యంగా చైనా, ఇటలీ, ఇరాన్, కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ తదితర దేశాల నుంచి ఫిబ్రవరి 15, ఆ తర్వాత వచ్చిన ప్రయాణికులందరిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలతో న్యూ ఢిల్లీలోని యూఏఈ ఎంబసీ అలర్ట్ అయ్యింది. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న యూఏఈ పౌరులు త్వజుదీ సర్వీస్ లో రిజిస్టర్ చేసుకోవాలని ఎంబసీ అధికారులు కోరారు. అలాగే +91 81819 11111 నెంబర్ కు కాంటాక్ట్ కావొచ్చని పేర్కొన్నారు.
--ప్రదీప్ (మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







