శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరో ఇద్దరు కరోనా అనుమానితులు
- March 14, 2020
హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరో ఇద్దరు కరోనా అనుమానితులు వచ్చారు. మలేషియా, అమెరికా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు, అనుమానితులను ప్రత్యేక వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కరోనా అనుమానితులను తరలించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అంబులెన్స్లను సిద్ధం చేస్తోంది. కరోనా అనుమానితులను శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి అనంతగిరికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి అంబులెన్స్లను అధికారులు రప్పించారు. జిల్లాల నుంచి కోఠి డీఎంఈ కార్యాలయానికి అంబులెన్స్లు చేరుకున్నాయి. అవసరమైతే ప్రైవేట్ అంబులెన్స్లు వాడుకోవాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







