శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరో ఇద్దరు కరోనా అనుమానితులు
- March 14, 2020
హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరో ఇద్దరు కరోనా అనుమానితులు వచ్చారు. మలేషియా, అమెరికా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు, అనుమానితులను ప్రత్యేక వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కరోనా అనుమానితులను తరలించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అంబులెన్స్లను సిద్ధం చేస్తోంది. కరోనా అనుమానితులను శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి అనంతగిరికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి అంబులెన్స్లను అధికారులు రప్పించారు. జిల్లాల నుంచి కోఠి డీఎంఈ కార్యాలయానికి అంబులెన్స్లు చేరుకున్నాయి. అవసరమైతే ప్రైవేట్ అంబులెన్స్లు వాడుకోవాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







