పవర్ స్టార్ కు పోటి గా సూపర్ స్టార్
- January 24, 2016
పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ చిత్రం ఏప్రిల్ లేదా మే నెలలో రిలీజ్ చేయబోతున్నారు..దీనికి పోటిగా సౌత్ ఇండియన్ సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా `కబాలి`. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.ఈ సినిమాలో ఆయన లుక్ కు ఇప్పటికే చాలా మంచి స్పందన వస్తోంది. సాల్ట్ పెప్పర్ లుక్కుతో నోట్లో పైప్తో రాజసంగా రజనీకాంత్ కూర్చున్న ఫస్ట్ లుక్ స్టిల్కు సర్వత్రా పాజిటివ్ స్పందన వెల్లడైంది. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన కలైపులి.యస్.థాను ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.జనవరి 20 నుంచి ఈ షెడ్యూల్ను మలేషియాలో తెరకెక్కిస్తున్నారు. రజనీకాంత్తో పాటు కీలక పాత్రధారులందరూ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 28 వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.ఈ సినిమా గురించి నిర్మాత కలైపులి.యస్.థాను మాట్లాడుతూ "నేను చాలా మంది పెద్ద హీరోలతో పనిచేశాను. కానీ రజనీకాంత్గారితో సినిమా చేయడమనేది నా లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా భావిస్తున్నాను. ఇది నా లైఫ్ టైమ్ గుర్తుండిపోయే సినిమా. ఈ చిత్రంలో ఇండియన్ సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, చైనా సూపర్స్టార్ విల్సన్ చౌ విలన్గా నటిస్తున్నారు. ఇప్పుడు మలేషియాలో చేస్తున్న షెడ్యూల్తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.మేలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సంతోష్ నారాయణ్ సమకూర్చిన బాణీలకు తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంతశ్రీరామ్ పాటలను రాస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం" అని చెప్పారు.రజనీకాంత్, రాధికా ఆప్టే, థన్సిక, కిశోర్, జాన్ విజయ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: మురళీ, సంగీతం: సంతోష్ నారాయణ్, ఆర్ట్: రామలింగం, ఫైట్స్: అన్బరివు, మాటలు: సాహితి, పాటలు: సిరివెన్నెల, చంద్రబోస్, అనంతశ్రీరామ్, మేకప్: భాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: `దేవి-శ్రీదేవి` సతీష్, నిర్మాత: కలైపులి.ఎస్.థాను.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







